Hyderabad:ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని విభాగాల కార్మికులకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు మాత్రం ఏ మాత్రం జీతాలు పెంచకపోవడం అన్యాయమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నర్సింహ విమర్శించారు.
నేడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాలుగవ రోజు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వీరి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి డాటా వేస్తున్నారే తప్ప నేటికీ అమలు చేయడం లేదని కేవలం రూపాయలు 9400/-తో ఒక కార్మికుడు జీవించడం ఎంత కష్టమో ప్రభుత్వం ఆలోచించాలని వారు కోరారు
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు రూపాయాలు 17500/- ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల శానిటేషన్ సిబ్బందిని మాత్రం పట్టించుకోకపోవటం అన్యాయం అని వారు అన్నారు
No comments:
Post a Comment