ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సెప్టెంబర్ 25ను పురస్కరించుకొని నిమ్స్ మెడికల్ స్టోర్ లోని ఫార్మసిస్టులు ఈరోజు అనగా సెప్టెంబర్ 24న ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ కంట్రోల్ ఆఫ్ మెడికల్ స్టోర్స్ డాక్టర్ పి ఉషారాణి , నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్స్ డాక్టర్ కె.వి.కృష్ణారెడ్డి, డాక్టర్ లక్ష్మీ భాస్కర్, మెడికల్ స్టోర్స్ డిప్యూటీ మేనేజర్ కె. రామ్మోహన్ రెడ్డి మరియు ఇతర మెడికల్ స్టోర్స్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మెడికల్ సూపరింటెండెంట్ మరియు కంట్రోల్లర్ ఆఫ్ మెడికల్ స్టోర్స్ కోవిడ్ సందర్భంగా కృషి చేసినటువంటి ఫార్మసిస్టులను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మసిస్టులు పేషెంట్ల సేవలలో డాక్టర్ల తర్వాత ముఖ్యపాత్రను పోషిస్తున్నారు అని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఫార్మసిస్టులు కె. నాగరాజ్,ఎండి ముక్తాదిర్,డి సతీష్,పి రవి మోహన్,బి శ్వేత, కె ఉషారాణి, ఏ రంజిత మరియు ఇతర ఫార్మసిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిలుగా విచ్చేసిన వారందరికీ మెడికల్ స్టోర్ తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
No comments:
Post a Comment